ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే మోత తప్పదు మరి

national |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 01:46 AM

తన ఆధాయాన్ని పెంచుకొనేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ తనముందున్న అన్ని అవకాశాలను వినియోగించుకొంటోంది. తాజాగా తీసుకొన్న నిర్ణయం ప్రకారం సరికొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం టీడీఎస్(మూలం వద్ద పన్నుకోత), టీసీఎస్(మూలం వద్ద పన్ను సేకరణ)లు రూ.25 వేలు లేదా అంతకుమించితే తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంది. ఒకవేళ సీనియర్ సిటిజన్లయితే ఈ మొత్తం రూ.50 వేలు లేదా ఆపై ఉంది. సీనియర్ సిటిజన్లకు రూ.50 వేలు లేదా ఆపై టీసీఎస్ లేదా టీడీఎస్ కట్ అయితే పన్ను రిటర్నులను దాఖలు చేయాలని ఐటీ శాఖ తన కొత్త పన్ను నిబంధనలలో పేర్కొంది. మరింత మంది ప్రజలను పన్ను డేటా బేస్‌లోకి తీసుకొచ్చేందుకు, ఐటీఆర్ ఫైలింగ్‌ను పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో మరింత ఎక్కువ మంది ఆదాయ వర్గాలు, ప్రజలు ఇక ఇప్పుడు పన్ను రిటర్నులను దాఖలు చేస్తారని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయి.


ఒక ఏడాదిలో ఒక వ్యక్తి రూ.50 లక్షలు లేదా ఆపై సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసినా కూడా తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలి. దీనికి వారి ఆదాయాలతో సంబంధం ఉండదు. బేసిక్ మినహాయింపు పరిమితి కంటే ఒక వ్యక్తి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఆదాయపు పన్ను రిటర్నలను తప్పనిసరిగా జారీ చేసే నిబంధనపై ఆర్థిక చట్టం, 2019 సెక్షన్ 139లో ఏడవ ప్రొవిజన్‌ను చేర్చింది. ఈ ప్రొవిజన్ కింద కరెంట్ అకౌంట్‌లో కోటి లేదా ఆపై డిపాజిట్ చేసినా.. విదేశీ ప్రయాణాల కోసం రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేసినా.. లేదా ఏడాదిలో విద్యుత్ ఛార్జీల కింద రూ.లక్షకు మించి కట్టినా కూడా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలి.


అంతేకాక గతేడాది ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం మర్చిపోయినా కూడా అత్యధిక టీడీఎస్ వర్తించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేర్కొంది. పలు ఆదాయ వర్గాల వారికి ఈ అత్యధిక టీడీఎస్ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. దీని కోసం సెక్షన్ 206ఏబీ, 206సీసీఏల కిందనున్న ప్రొవిజన్లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ మార్చిన నిబంధనలు కూడా ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa