సైనికులతో ఆయన కలసిమెలిసేలా వ్యవహరించారు. వారిలో ఒక్కరిగా నడుచుకొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం జమ్మూకశ్మీర్కు చేరుకున్నారు. అక్కడ రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొన్ని ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే భద్రతా దళాలతో మాట్లాడనున్నారు. జమ్మూకశ్మీర్కి చేరుకున్న ఆయన మొదట మంత్రి సింగ్ బారాముల్లాను సందర్శించి అక్కడ పుష్పగుచ్ఛం ఉంచారు. అనంతరం అక్కడే ఆర్మీ అధికారులతో కలసి భోజనం కూడా చేశారు.
తర్వాత కొద్దిసేపు సైనికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్... భారత్ను వెయ్యి కోతలతో నెత్తురు కారేలా చేయాలని చూస్తుందని, కానీ మీరు దేశానికి ఫెన్సింగ్ వైరుగా ఉన్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. దానివల్ల పాకిస్థాన్ తమను తామే హింసించుకుంటుందని అన్నారు. అంతేకాదు "దేశం మిమ్మల్ని విశ్వసిస్తుంది. వారికి మీ గురించి తెలుసు. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నాం." అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ ఎన్ని కుట్రలు చేస్తోన్న భారత సైనికులు అడ్డుకుంటున్నారని ప్రశంసించారు.
ఇదిలావుంటే అంతకు ముందు ఆయన 2020లో చైనా సైన్యంతో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్లకు కూడా మంత్రి నివాళులర్పించారు. ఆ ఏడాది జూన్ 15న తూర్పు లడఖ్లో చైనా పీఎన్ఏతో జరిగిన హింసాత్మక పోరులో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. "వారి ధైర్యం, శౌర్యం, అత్యున్నత త్యాగం ఎప్పటికీ మరువలేనిది. ఆ ధైర్యవంతులకు నివాళులర్పిస్తున్నాను." అని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా రాజ్నాథ్ సింగ్ ఆయన పర్యటనలో భాగంగా జమ్మూలో జరిగే మహారాజా గులాబ్ సింగ్ జీ "రాజ్యాభిషేక్ వేడుక" 200వ వార్షికోత్సవానికి కూడా సింగ్ హాజరవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa