ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 10:11 AM

మృగశిర కార్తె చివరి అంకంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం కాసేపు వేడి వాతావరణం, కాసేపు మబ్బులతో కూడిన వాతావరణం చోటుచేసుకుంటుంది. నైరుతి రుతుపవనాల కారణంగా విజయవాడ నగరానికి సమీపంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ భారీ వర్షం తుపానుగా మారి మరో గంటలో ఏలూరు, కృష్ణా జిల్లా వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అంతేగాక, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa