2019 ఎన్నికల ముందు ప్రచారంలో కానీ, పాద యాత్రలో కానీ పదే పదే జగన్ పలికిన మాటలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవిని అని. ఎవరు ప్రత్యేకహోదా ఇస్తే వారికీ మా మద్దతు ఉంటుంది అని తెలియజేసారు. అలానే అన్ని ఎంపీ స్థానాలు వైసీపీ గెలిపించండి ప్రత్యేక హోదా ఎలా రాదో చూస్తా... అంటూ ఎన్నో సార్లు అనడం జరిగింది. కానీ ఎలక్షన్ ముగిసిన తర్వాత వైసీపీ పార్టీకి ఆ అవకాశం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ తాజాగా రాష్ట్రపతి పదవి కాలం ముగియడంతో రాష్ట్రపతి ఎన్నికకు వైసీపీ మద్దతు అవసరమైయేలా ఉంది. ఈ తరుణంలో టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ మాట్లాడుతూ... ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని 22 మంది ఎంపీలని ప్రజలు ఇచ్చారు.ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడింది నిజమైతే...ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా? మెడలు వంచుతారా? కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa