ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతన్నల మేలుకోరే ప్రభుత్వం: విత్తన పంపిణీ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 01:45 PM

మాది రైతన్నల మేలుకోరే ప్రభుత్వమని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వ్యవసాయ అభివృద్ధికి బాటలు పడ్డాయని, దీనికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట సీనియర్ శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం నరసన్నపేట మండలం సత్యవరం అగ్రహారంలో స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద రాష్ట్ర ఏపీ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి శేఖర్ బాబుతో కలిసి సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పంట పంటకు మధ్య వ్యత్యాసం ఉంచి వ్యవసాయం చేసినట్లయితే రైతుకు మంచి ఫలితాలు అందుతాయన్నారు.


వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతు భరోసా కేంద్రం లో స్థానిక రైతులతో ఖరీఫ్ సీజన్ కు ముందే సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అంతే కాకుండా వారికి తగిన సలహాలు సూచనలు అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా రాయితీల పై విత్తనాలను అందజేస్తుందని అంతేకాకుండా ట్రాక్టర్లు కూడా రైతులతో గ్రూపులను ఏర్పాటు చేసి వారికి అందిస్తున్నామని చెప్పారు. వీటిని ప్రతి ఒక్కరు రైతు సద్వినియోగం చేసుకోవాలని అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు కూడా పాటించాలని కోరారు. అనంతరం రైతులకు రాయితీ వరి విత్తనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పిటిసి సభ్యులు చింతు అన్నపూర్ణ రామారావు, రాష్ట్ర కూరాకుల కార్పొరేషన్ అధ్యక్ష ప్రతినిధి రాజపు అప్పన్న, పీఏసీఎస్ అధ్యక్షులు సురంగి నర్సింగరావు, హస్త కళల కార్పొరేషన్ డైరెక్టర్ బొబ్బది ఈశ్వరరావు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రవీంద్ర భారతి, నరసన్నపేట వ్యవసాయ శాఖ అధికారిణి సునీత, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa