జగన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్ని పట్టించుకోకపోగా.. బాధ్యత గల స్థానంలో ఉనవాళ్లే ఆ రైతుల కుటుంబాలను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 13 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి మించిన దౌర్భాగ్యం ఏముంటుందన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులకు భరోసా కరువైన సమయంలో పవన్ కళ్యాణ్ మేమున్నాం అంటూ వారికి అండగా నిలిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కొలు రైతు కుటుంబాలకు సాయం అందించబోతున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa