ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 7నుంచి 7వ విడత కళ్యాణమస్తు: టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 11:29 PM

పేదల కోసం నిర్దేశించిన ఉచిత వివాహాల పథకం కళ్యాణ్ మస్తుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ ఏడాది కళ్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద జంటలకు వివాహాలు చేసేందుకు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన 7వ విడత కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందు కోసం జూలై 1వ తేదీ నుంచి దరఖాస్తులు న‌మోదు చేసుకోవాల‌ని టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి సూచించారు. ఈ మేరకు కళ్యాణ‌మ‌స్తు కార్యక్రమ ముహూర్త ప‌త్రిక‌ను శుక్రవారం తిరుమ‌ల శ్రీ‌వారి పాదాల వ‌ద్ద ఉంచి ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. కొత్తగా పెళ్లి చేసుకునే జంటకు పెళ్లి దుస్తులు, పుస్తెలు, మెట్టెలు అందించి పెళ్లి భోజ‌నం వ‌డ్డిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన‌ట్లు తెలిపారు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత క‌ళ్యాణ‌మ‌స్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభించామ‌ని, మొద‌ట ఆంధ్రప్రదేశ్‌‌లో నిర్వహించి ఆ త‌ర్వాత ఇత‌ర రాష్ట్రాల్లో చేప‌డ‌తామ‌ని వివరించారు.


ముందుగా శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో పూజ‌లు చేప‌ట్టారు. అక్కడి నుంచి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ‌ ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్దకు చేరుకున్నారు. క‌ళ్యాణ‌మ‌స్తు కార్యక్రమానికి ఆగ‌స్టు 7న ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య పండితులు సుముహూర్తం నిర్ణయించిన‌ట్లు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకునే జంట అన్ని జిల్లాల్లో సూచించిన ప్రాంతాల్లో ముందుగా న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో క‌ల్యాణ‌మ‌స్తు కార్యక్రమం నిర్వహిస్తామ‌న్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa