రేగిడి ఆమదాలవలస మండలంలోని తోకల వలసలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారానికి యత్నించిన పెత్తందారులు బాలిక తల్లిదండ్రుల పై దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పై శనివారం రేగిడి ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు. బాధితులు తెలియజేసిన వివరాల ప్రకారం.. తోకల వలస గ్రామంలో వెనుకబడిన తరగతికి చెందిన బాలిక దుస్తులు ఇంటింటికి తీసుకువచ్చే క్రమంలో పెత్తందారు మణికంఠ ఆమె వెంట పడ్డాడు. బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఈ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పగా శనివారం మణికంఠ కుటుంబ సభ్యులను నిలదీసేందుకు వెళ్లారు. తమకు ఎలాంటి సంబంధం లేదని తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. పైగా మమ్మల్ని ప్రశ్నిస్తారా.. అంటూ బాలిక తల్లిదండ్రుల పై యువకుడి కుటుంబ సభ్యులు బంధువులు అంతా కలిసి దాడి చేశారు. ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రులతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద 324, 354 కేసులు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa