ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వయంగా చెత్త ఎత్తిన ప్రధాని నరేంద్ర మోడీ

national |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 08:52 PM

స్వచ్చ భారత్ విషయంలో ముందుగా తన పాత్ర పోషించి ఆపై దేశానికి ఆదర‌్శంగా నిలవాలని భావించారు ఏమో ప్రధాని నరేంద్ర మోడీ అందరికీ షాక్ ఇచ్చే పనిచేశారు. ఢిల్లీలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి స్వయంగా కిందపడిన చెత్తను ఏరి తీశారు. స్వచ్ఛ భారత్, క్లీన్ ఇండియా మిషన్ వంటి పెద్ద కార్యక్రమాలకు ప్రధాని చేసిన ఈ పని ఉదాహరణగా నిలిచింది. ప్రధానమంత్రి మోడీ సెంట్రల్ ఢిల్లీలోని ఐటీపీవో టన్నల్ దగ్గర కింద ఉన్న చెత్తను తీశారు. దీనికి సం బంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా "ITPO టన్నల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెత్తను తొలగించి.. పరిశుభ్రత ఆవశ్యకత గురించి మరోసారి తెలియజేశారని పేర్కొన్నారు."


అలాగే ఐటీపీవో టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ టన్నల్ ప్రాజెక్ట్ అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. "ఇటువంటి ప్రాజెక్టుల ప్రక్రియకు అంతరాయం కలిగించే వ్యక్తులకు మన దేశంలో కొరత లేదు. కానీ తాము దానిని సాధించాం." అని ప్రధాని మోదీ అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ ఢిల్లీలోని ఈ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇది విభిన్న రంగాలలో, ముఖ్యంగా వాణిజ్యంలో దేశం సాధించిన గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది.


ఇక స్వచ్ఛభారత్ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 2, 2014న ప్రారంభించారు. మహాత్మా గాంధీ 145వ జయంతిని పురస్కరించుకుని ఆరోజునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కింద అన్ని గ్రామాలు, గ్రామ పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గ్రామీణ భారతదేశంలో 100 మిలియన్లకుపైగా మరుగుదొడ్లను నిర్మించారు. ఈ కార్యక్రమం ఇప్పుడు స్వచ్ఛ్ భారత్ మిషన్ అని పిలవబడే తదుపరి దశకు వెళ్తుంది. ఇది బహిరంగ మలవిసర్జన రహిత ప్రవర్తన కోసం ప్రయత్నిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa