చదవాలన్నకసీ ఎవరినైనా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తోంది. విజయం అనే మెట్టును ఎక్కిస్తుంది. ఇలాంటి ఘటనే ఇటీవల చోటు చేసుకొంది. బాధ్యతల వల్లో.. పేదరికం వల్లో చిన్నతనంలో చదువుకోలేక.. పెద్దయ్యాక చదువుకున్నవారు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆగిపోయిన తమ చదువును కొనసాగిస్తున్నారు. అలాగే ఓ వ్యక్తి కూడా తన చదువును కొనసాగిస్తున్నాడు. అయితే అతను తన కొడుకుతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.
పూణెకు చెందిన భాస్కర్ వాగ్మారే (43), అతని కొడుకు కలసి ఈ సంవత్సరం 10వ తరగతి మహారాష్ట్ర బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అయితే ఆ పరీక్షల్లో తండ్రి భాస్కర్ పాస్ అయ్యారు. కానీ కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక ఆ కుటుంబ సభ్యులు గందరగోళంలో పడ్డారు. నిజానికి భాస్కర్ తన కుటుంబ పోషణ కోసం ఏడో తరగతిలోనే చదువు ఆపేసి.. పనికి వెళ్లాల్సి వచ్చింది. ఇన్నాళ్లకు తను మళ్లీ చదువును కొనసాగించాలని భావించాడు. 30 ఏళ్ల విరామం తర్వాత కొడుకుతో కలిసి ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యాడు. కానీ ఇప్పుడు ఈ విధమైన ట్విస్ట్ వచ్చింది.
భాస్కర్ ప్స్తుతం పూణె నగరంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ డయాస్ ప్లాట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నేను ఎప్పటి నుంచో ఎక్కువ చదువుకోవాలనుకున్నాను. కానీ కుటుంబ బాధ్యతలు, జీవనోపాధి కోసం పనిలో చేరడంతో అది సాధ్యం కాలేదు." అని చెప్పారు. అయితే ఇన్నాళ్లకు చదువును కొనసాగించాలనుకున్నానని ఆయన అన్నారు. తన కొడుకు కూడా ఈ ఏడాదే పదో తరగతి పరీక్షలు రాశాడని, అది తనకు కొంత ఉపయోగపడిందని చెప్పారు.
అలాగే "ఇప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషిస్తున్నా.. అయితే నా కొడుకు రెండు పేపర్లలో ఫెయిలయ్యాడని బాధగా ఉంది." అని మోదీ అన్నారు. అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసి.. వాటిని క్లియర్ చేస్తాడని భాస్కర్ అన్నారు. దీనిపై అతని కుమారుడు సాహిల్ కూడా దీనిపై స్పందించాడు. "మా నాన్న పాస్ అయినందుకు సంతోషంగా ఉంది. కానీ నేను కూడా వదులుకోను. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతాను. పేపర్లు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను." అని సాహిల్ అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa