ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంద్ పై డేగా కన్ను...అల్లర్లు చేపడితే గుర్తించేందకు సర్వంసిద్దం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 03:49 PM

అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు  చెలరేగిన విషయం తెలిసిందే.   ఈ పథకం రద్దు చేయాలని కోరుతూ నేడు చేపట్టిన బంద్ పై భద్రతా ధళాలు డేగకన్నువేస్తున్నాయి. ఎక్కడైన, ఏదైనా జరగరానిది జరిగితే వాటిని ఉక్కపాదంతో అణిచేందుకు సీసీ కెమెరాలు,  ఇతర  ఎలక్ట్రానిక్  యంత్రాల వాడకంతో గుర్తించేలా పోలీసు యంత్రంగా అన్ని ఏర్పాట్లుచేసింది. ఇదిలావుంటే  అగ్నిపథ్ రగడ కొనసాగుతూనే ఉంది. రైల్వే స్టేషన్ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. అయితే రేపు (సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అల్లర్లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ఆర్పీఎఫ్ యూనిట్లకు ఆదేశించారు. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నేరారోపణకు సరిపోయే సాక్ష్యాలను సేకరిస్తున్నారు. డిజిటల్ సాక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. మొబైల్, వీడియో రికార్డింగ్ సాక్ష్యం, సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.


అగ్నిపథ్ పథకం అగ్గిరాజేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కూడా చేసింది. అయితే విద్యార్థులు రోడ్డెక్కడానికి కారణం సోషల్ మీడియా అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ గ్రూపులపై నిషేధం విధించింది.అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో సమాచారం అందజేశారు. అలా 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది. వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని పేర్కొంది. దాంతోనే హింసకు దారితీసిందని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇన్ వాల్వ్ అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరాతీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa