తోటలో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడిచేసింది. ఏం జరుగుతుందోనని తెలుసుకొనే లోపే ఎనిమిదిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో వారికి గాయలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. కిడిసింగి- వజ్రపుకొత్తూరు మధ్య జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వజ్రపుకొత్తూరుకు చెందిన అప్పలస్వామి, పురుషోత్తం, చలపతి, షణ్ముఖరావు, సంతోష్, తులసీదాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడిలో 10 పశువులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లాకు మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. ఎలుగుబంట్ల నివారణకు అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa