నైరుతి రుతుపవనాల్లో కదలిక ఏర్పడటంతో రానున్న ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.ఇదిలావుంటే రుతుపవనాల్లో మందగమనం తాత్కాలికమేనని.. త్వరలోనే అవి పుంజుకుంటాయని అధికారులు అంటున్నారు.ఈ నెల 23 తర్వాత వాయవ్య భారతంలో వర్షపాతం పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు రాబోయే మూడు, నాలుగు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. రాగల ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది. కర్ణాటక, గోవా, కేరళ, ద్వీప్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయంటోంది.
కళింగపట్నం వరకు విస్తరించిన రుతుపవనాలు మూడు రోజుల నుంచి మిగిలిన ప్రాంతాలకు వ్యాపించలేదు అంటున్నారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాను తాకిన తర్వాత జార్ఖండ్, బీహార్ వైపుగా విస్తరిస్తాయి.. ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా జరిగిందని అధికారులు అంటున్నారు. ద్రోణి ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల ఆదివారం వర్షాలు కురిశాయి. అలాగే రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa