ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలుపంచుకొంటున్నారు. సోమవారంనాడు పశ్చిమ గోదావరి జిల్లాలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ప్రధాని పర్యటనలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. సోమవారంనాడు ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. ఉదయం 10.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పయనమవుతారు. ఉదయం 10.50 గంటలకు భీమవరం చేరుకుంటారు. ఆపై, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు భీమవరం నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రధాని మోదీకి వీడ్కోలు పలకనున్నారు. అనంతరం, తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa