ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది మానవ తప్పిదమే...సారీ...ఇపుడు ఏం చేయలేం: బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ

sports |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 03:11 AM

ఆటలో గెలుపు ఎంతో ముఖ్యం. అలాంటి ఆటలో గెలిచే అవకాశమున్నా ఇతరుల కారణంగా తాము అకారణంగా ఓడితే ఆ బాధ ఏమిటో ఓడిన వారికే తెలుస్తుంది. ఇదిలావుంటే ఈ ఏడాది ఏప్రిల్ లో సింధు బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్ షిప్ టోర్నీలో ఆడింది. అయితే, ఆ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర విమర్శలపాలైంది. సింధు సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందంటూ ఆమె ప్రత్యర్థి అకానే యమగూచికి రిఫరీ ఓ పాయింట్ కేటాయించాడు. యమగూచి సిద్ధంగా లేదని భావించి సర్వీస్ చేసేందుకు సమయం తీసుకున్నానని సింధు తన వాదన వినిపించింది. కానీ ఆ రిఫరీ వినిపించుకోలేదు. ఆ తర్వాత యమగూచి పుంజుకుని సింధుపై విజయం సాధించింది. 


ఇదిలావుంటే బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఈ అంశంపై తాజాగా స్పందించింది. ఆ మ్యాచ్ లో రిఫరీ చేసింది తప్పేనని కమిటీ అంగీకరించింది. పీవీ సింధుకు క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటన చేసింది. అది మానవ తప్పిదమేనని, కానీ ఇప్పుడు ఏంచేయలేమని విచారం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పీవీ సింధుకు బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ చైర్మన్ లేఖ రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa