ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరుగుతూ...ఆపై తగ్గుతూ..దేశంలో కరోనా వైరస్ తీరు ఇలా

national |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 05:17 PM

భారతదేశంపై కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా పోయిందని నిర్ధారణకు వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం 4.54 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే.. కొత్తగా 16,159 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారించారు. పాజిటివిటీ రేటు 3.56 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 15,394 మంది కోలుకోగా.. 24 గంటల వ్యవధిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,15,212 (0.26 శాతం)కి పెరిగాయి. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.29 కోట్ల మంది ( అంటే 98.53 శాతం) కోలుకున్నారు. ఇప్పటి వరకు 5.25 లక్షల మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ కట్టడిలోనే ఉండగా.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.


మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,913 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 552 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని.. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,753కు చేరగా.. కరోనా బారి నుంచి మరో 496 మంది కోలుకున్నట్లు పేర్కొన్నారు.


కొత్త కేసుల్లో హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా 316 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 51, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 36, సంగారెడ్డిలో 28, ఖమ్మంలో 14, నల్గొండలో 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇంకా 666 మందికి సంబంధించిన కొవిడ్ పరీక్షల రిపోర్టులు అందాల్సి ఉందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa