వివిధ విషయాలలో ముందుంటున్న ఒడిశా రాష్ట్రం తాజాగా మరో రికార్డ్ సొంతం చేసుకొంది. జాతీయ ఆహార భద్రతాచట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) అమలులో ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. ఆహార భద్రత అమలుపై రాష్ట్ర మంత్రులతో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ ర్యాంకుల వివరాలను వెల్లడించారు. ఎన్ఎఫ్ఎస్ఏ అమలులో ఒడిశా దేశంలోనే టాప్లో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు నిలిచాయి. తెలంగాణకు 12వ స్థానం దక్కింది. ఇందులో 0.836 స్కోరుతో ఒడిశా ముందు వరసలో నిలవగా, ఉత్తరప్రదేశ్ 0.797 స్కోరు చేసి ద్వితీయస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 0.794 స్కోరు దక్కించుకుని మూడో ర్యాంకు దక్కింది.
ఇక ప్రత్యేక కేటగిరి రాష్ట్రాల్లో (ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు) త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో హిమాచల్ప్రదేశ్, సిక్కింలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్నా.. సాధారణ రాష్ట్రాలతో పోటీ పడ్డాయి. ‘ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు’ లాంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు పీయూష్ గోయల్. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఈ పథకం ప్రయోజనాలు పొందొచ్చన్నారు. రానున్న కాలంలో ఇతర రాష్ట్రాలూ మరింత దృష్టి సారించి మెరుగైన ర్యాంకులు పొందుతాయన్నారు.
ఎన్ఎఫ్ఎస్ఏ కింద రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యవసరాలు సరఫరా చేస్తారు. టీపీడీఎస్ కింద ఎన్ఎఫ్ఎస్ఏ అమలు తీరును లెక్కిస్తారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా, ఉత్తర్ప్రదేశ్లకు మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. దీని కింద ఇప్పటివరకు 45 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa