ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వ్యాఖ్యల దుమారం...కేరళ మంత్రి రాజీనామా

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 02:58 AM

నోటి దురుసుతనం కూడా ఒక్కోసారి మనల్ని రోడ్డున పడేస్తుంది. తాజాగా కేరళ మంత్రి విషయంలోనూ అదే జరిగింది. మన రాజ్యాంగం సాధారణ ప్రజలను దోచుకునేలా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మత్స్యశాఖ మంత్రి సాజి చెరియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో  సీపీఎం అగ్రనాయకత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది.  ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్‌ను కలిసిన చెరియన్ అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేసిన ఆయన శాసనసభ్యత్వాన్ని మాత్రం వదులుకోలేదు. నిజానికి ఆయనను కాపాడేందుకు రాష్ట్ర నాయకత్వం చివరి క్షణం వరకు ప్రయత్నించినప్పటికీ అగ్రనాయకత్వం ఆదేశాలకు తలొగ్గక తప్పలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa