ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ కాళ్ల దగ్గర ప్రత్యేక హోదా, విభజన హామీలు తాకట్టు: శైలజానాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 03:08 AM

మోదీ కాళ్ల దగ్గర ప్రత్యేక హోదా, విభజన హామీలను జగన్ తాకట్టు పెట్టారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేస్తున్న ప్రధాని మోదీకి, బీజేపీకి ముఖ్యమంత్రి జగన్ మద్దతిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.  అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన చెప్పారు. హోదా సాధించడం కోసం వైసీపీ ఎమ్మెల్యేలను సైతం కలిసి, వారి మద్దతు కోరుతామని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతరేకంగా టీడీపీ, వైసీపీలు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa