చేపల వేట ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. రోయ్య రూపంలో చేపలు పట్టే వ్యక్తిని ప్రమాదం వెంటాడింది. ఏలూరు జిల్లాలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణ అనే వ్యక్తి గణపవరంలో చేపలు పడుతున్న సమయంలో.. రొయ్య అతడి ముక్కులోకి దూరింది. ముక్కు రంధ్రాల్లోకి ప్రవేశించిన రొయ్య ఎంతకూ బయటకు రాలేదు. దీంతో అతడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన సహచరులు అతణ్ని చికిత్స నిమిత్తం భీమవరంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్కు తరలించారు.
ఎండోస్కోపీ చేసిన డాక్టర్లు.. ముక్కులో ఇరుక్కున్న రొయ్యను బయటకు తీశారు. రొయ్యకు ఉన్న ముళ్లు ముక్కులో గుచ్చుకున్న కారణంగా అది బయటకు రాలేకపోయిందని డాక్టర్లు తెలిపారు. బయటకు తీసిన సమయంలో అది బతికే ఉందన్నారు. ముక్కులో స్వల్ప గాయాలు మినహా మరే ఇబ్బంది లేకపోవడంతో ఆ వ్యక్తిని డాక్టర్లు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఇలాంటి ఘటనే ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడులో చోటు చేసుకుంది. పుదుకొట్టై జిల్లా అన్నవాసల్లో ఏడో తరగతి చదువుతున్న అరుళ్ అనే విద్యార్థి.. స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడం కోసం సమీపంలోని కాల్వకు వెళ్లాడు. ఆ సమయంలో అరుళ్ ముక్కులో ఓ చేప పిల్ల దూరింది. దీంతో అతణ్ని హాస్పిటల్కు తీసుకెళ్లగా.. డాక్టర్లు దాన్ని జాగ్రత్తగా వెలికి తీశారు. దీంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa