మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన ఆగ్రనాయకుడు నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. కొందరు వైసీపీ నేతలు, ముఖ్యంగా పేర్ని నాని వంటి వారు నోటి విరేచనాలతో బాధ పడుతున్నారని నాగబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పెట్టిన తిండి అరగక నోటికొచ్చినట్టు పేర్ని నాని వాగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు అప్పుడప్పుడు సాత్వికమైన ఆహారాన్ని పెట్టాలని తమ అధినేత పవన్ కల్యాణ్ ను కోరుతున్నానని వ్యంగ్యంగా అన్నారు. బందరులో పేర్ని నానికి దగ్గర్లో ఎవరైనా డాక్టర్ ఉంటే ఆయన నోటి విరేచనాలకు మందు ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు. వపన్ కల్యాణ్ ఒక వింత పోకడలు ఉన్న రాజకీయ నాయకుడని... ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించి ఉండరని పేర్ని నాని విమర్శించిన సంగతి తెలిసిందే. షూటింగులకే కాకుండా, రాజకీయాలకు కూడా ఆయన ఆలస్యమేనని ఎద్దేవా చేశారు. పవన్ చేసేది వీకెండ్ ప్రజాసేవ అని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై నాగబాబు మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa