భారీ వర్షాలకారణంగా పాకిస్తాన్ లో జనజీవనం సవాల్ గా మారింది. వరదల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రతి చోట వరదలు ముంచెత్తుతున్నాయి. బలూచిస్థాన్లోని దక్షిణ ప్రావిన్స్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల మహిళలు, పిల్లలతో సహా 57 మంది మరణించారు. అలాగే వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దేశంలోని అతిపెద్ద నగరమైన కరాచీలో గత కొన్నిరోజులుగా వీధులు జలమయం అయ్యాయి. బలూచిస్థాన్లో వర్షాల వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. దక్షిణ ప్రావిన్స్లో వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎనిమిది ఆనకట్టలు తెగిపోయాయి. మహిళలు, పిల్లలతో సహా కనీసం 57 మంది మరణించినట్టు ప్రావిన్స్ సీఎం విపత్తు, హోం వ్యవహారాల సలహాదారు జియావుల్లా లాంగోవ్ తెలిపారు.
అలాగే నగరంలోని ఖయ్యూమాబాద్ చౌరంగి, అక్తర్ కాలనీ, డిఫెన్స్ మోర్ దగ్గర తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోరంగి రోడ్డు, పీఐడీసీ సిగ్నల్ చౌక్లో రహదారులు నీట మునిగాయి. నీటి ఎద్దడి వల్ల అనేక ఇతర రహదారులు, అండర్పాస్లు కూడా మూసివేశారు. కరాచీ దక్షిణ ప్రాంతాల్లోని డిఫెన్స్, క్లిఫ్టన్, సద్దర్, కెమారి, కోరంగి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది.
భారీ వర్షాల కారణంగా కరాచీ నుంచి హైదరాబాద్ రోడ్డు మునిగిపోయింది. దీంతో వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.ఇల్లు కూలిన ఘటనలో మరో నలుగురు గాయపడినట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు. వర్షాల కారణంగా పాకిస్థాన్లోని వర్షాలకు దెబ్బతిన్న నగరాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరాచీలో వర్షంతో పాటు ఒక్కసారిగా పిడుగులు కూడా పడ్డాయి.
2010లో కూడా పాకిస్థాన్లో వర్షాలు భారీ కురిశాయి. దారుణమైన వరదలు తలెత్తాయి. దాంతో 20 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెద్ద మొత్తంలో పంటలు నాశనమయ్యాయి. 12 నెలలపాటు కురిసిన వర్షాల వల్ల దేశంలోని ఐదో వంతు జలమయమైంది. ఆ వరదలతో పాకిస్థాన్ దాదాపుగా అతలాకుతలం అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa