ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజావాణి ఆర్జీలపై...ప్రభుత్వానికి లేఖలు: జనసేన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 11:50 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో అర్జీల రూపంలో వచ్చిన ప్రజా సమస్యలపై పరిష్కారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఇదిలావుంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయవాడలో నిన్న రెండో విడత జనవాణి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ప్రజలు వినతిపత్రాలతో భారీగా తరలివచ్చారు. కాగా, జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో ఇప్పటివరకు రెండు విడతల్లో అందిన అర్జీలను పరిశీలించే కార్యక్రమాన్ని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు షురూ చేశారు. ఈ అర్జీలను పరిశీలించి, వాటిలోని సమస్యల ఆధారంగా సంబంధిత ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయనున్నారు. ఈ ప్రక్రియను నాదెండ్ల నేడు సమీక్షించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జనసేన నేత డి.వరప్రసాద్ నేతృత్వంలో ఈ అర్జీలను శాఖల వారీగా విభజించి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు అర్జీదారుల సమస్యలు తెలియజేస్తారు. 


దీనికోసం జనసేన పార్టీ అధినాయకత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ప్రతి అర్జీని ఈ బృందం పరిశీలించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రతి సమస్యను సమీక్షించి, స్వయంగా సంబంధిత శాఖలకు లేఖలు రాస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa