'బాదుడే బాదుడు' అంటూ సాగే ఓ గీతాన్ని ఏపీ ప్రజల తరఫున మీకు అంకితం ఇస్తున్నాను జగన్ గారూ అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ట్విట్టర్ లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా బాదుడే బాదుడు అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు కురిపిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర ఓ పాటను సీఎం జగన్ కు అంకితం చేస్తున్నట్టు వెల్లడించారు.
విద్యుత్ చార్జీలతో బాదుడే బాదుడు, ఆర్టీసీ చార్జీలతో బాదుడే బాదుడు, ఇంటి పన్ను నుంచి చెత్త పన్ను వరకు బాదుడే బాదుడు, విద్యుత్ కోతలతో ప్రజలను వీర బాదుడు బాదుతున్నారని కొల్లు రవీంద్ర వివరించారు. ఈ తుగ్లక్ సీఎం పాలనకు ప్రజలు వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నామని, 'బాదుడే బాదుడు' అంటూ సాగే ఈ గీతాన్ని ఏపీ ప్రజల తరఫున మీకు అంకితం ఇస్తున్నాను జగన్ గారూ అంటూ కొల్లు రవీంద్ర ట్విట్టర్ లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa