ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సీఎం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకోనున్నారు. అక్కడి నుంచి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులతో వరదపై సమీక్షించనున్నారు. ఇప్పటికే విశాఖ ఎయిర్పోర్టుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. సీఎంకు మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, వైయస్ఆర్సీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్కు సీఎం బయలుదేరారు. వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa