నడిరోడ్డుపై నానా తంటాలు ఏలూరు నుంచి వచ్చిన దివ్యాంగుడు భాస్కర్ ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ల తీరును జనవాణి - జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి అందించే ట్రై సైకిళ్లు మోటారువి ఇవ్వడం నిలిపేశారు. కేవలం ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే ఇస్తున్నారు. ఖర్చు తక్కువ కావడంతో వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి బరువు ఎక్కువ ఉన్నా, ఎత్తు ప్రదేశాల్లోనూ ముందుకు నడవని పరిస్థితి ఉంది. దీంతో నడిరోడ్డుపైన దివ్యాంగులు నరకయాతన పడుతున్నారు. అలాగే దివ్యాంగులకు ఎంత మేర వైకల్యం ఉందనే దానిపై పింఛను విధానం ఆధారపడి ఉండాలని, 100 శాతం ఉన్న వారికి ఒకలా, కొద్దిగా వైకల్యం ఉన్న వారికి మరోలా పింఛను విధానం అమలు చేయాలని భాస్కర్ కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ ని వేడుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa