సీఎం గాల్లో హెలికాఫ్టర్ వేసుకుని తిరిగితే ప్రజల కష్టాలు తెలియవని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. గురు, శుక్రవారాల్లో పలు ముంపు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. కాలికి బురద అంటకుండా వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తే వాస్తవాలు ఎలా తెలుస్తాయని.. ప్రజల బాధలు ఎలా అర్థం అవుతాయని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ను ప్రశ్నించారు.
గోదావరి వరదలతో వందల గ్రామాలు ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 6 జిల్లాలలోని 550కిపైగా గ్రామాల్లో గోదావరి వరదలు తీవ్ర ప్రభావం చూపాయని, కానీ ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదని చంద్రబాబు ఆరోపించారు.
విపత్తుల సమయంలో ఆయా ప్రాంతాల్లో మంత్రులు గాని, ఇతర ప్రభుత్వ పెద్దలు గానీ నిరంతరం పర్యవేక్షించే పరిస్థితి ఉండాలని, ఈ ప్రభుత్వంలో అదేమీ లేదని చంద్రబాబు అన్నారు. జగన్ వరదలపై నాన్ సీరియస్గా ఉండడం వల్లనే.. క్యాబినెట్, ఇతర యంత్రాంగం కూడా అలాగే వ్యవహరిస్తుందని అన్నారు. వరదల విషయంలో ప్రతీ నిమిషం కీలకమేనని, ఇలాంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం సరిగా స్పందిచకపోవడం బాధాకరం అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
వరదలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సూచించారు. టెలీ కాన్ఫరెన్స్లో చంద్రబాబు పలువురు బాధితులతో మాట్లాడారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి కూడా సాయం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని.. పార్టీ నేతలతో కలిసి ప్రజలకు సాయం అందిస్తారని చంద్రబాబు తెలిపారు. గోదావరి వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తానే స్వయంగా గురు, శుక్రవారాల్లో పలు ముంపు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa