గోదావరి వరదలతో ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేసి కావాల్సిన వనరులను వారి చేతుల్లో పెట్టి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలోకి పంపించాం. గత పాలకుల మాదిరిగా ప్రచార ఆర్భాటాలు కాకుండా ప్రజలకు మంచి జరగాలని తపన, తాపత్రయంతో అడుగులు వేశాం’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లను సీఎం వైయస్ జగన్ అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊడుముడి లంక గ్రామంలో సీఎం వైయస్ జగన్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa