కోనసీమ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేటి రాత్రి రాజమహేంద్రవరంలో బసచేయనున్నారు. ఇదిలావుంటే వరద ప్రాంతాల పరిశీలన కోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ యువ నేత మార్గాని భరత్ రామ్, ఆయన తండ్రి మార్గాని నాగేశ్వరరావు కలిశారు. మంగళవారం కోనసీమ జిల్లాలో పర్యటనను ముగించుకుని రాత్రికి రాజమహేంద్రవరం చేరుకున్న జగన్... రాత్రికి అక్కడే బస చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో తన కుమారుడు మార్గాని భరత్ తో కలిసి సీఎం జగన్ కు మార్గాని నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎంపీ భరత్ సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa