మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ చార్జీలు పెంచడం వలన ఇల్లు గడవడం కష్టమవుతోందని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేసారు. పైగా అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ పథకాలు కట్ చేసారని అన్నారు.
పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి, చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలని ప్రజలకి తెలియజేసారు. కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వైరస్ జగరోనా వైరస్ అని... అది రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తోందని ప్రజలకు తెలియజేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్న జగన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని... విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని బలితీసుకుంటున్నాడని తెలియజేసారు.
ఉచితంగా దొరికే ఇసుకను బంగారం చేసిన జగన్ రెడ్డి ఎంతో మందికి ఉపాధి లేకుండా చేశారు. ఇటు ప్రజలు పని దొరక్క కష్టాలు పడుతుంటే... ఇసుక అక్రమంగా రాష్ట్రం దాటి బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్తోంది. అలా దోచుకున్న వందల కోట్ల డబ్బు జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తోంది.
రాష్ట్రంలో రోడ్ల పై ప్రజలు పడుతున్న బాధలు తలుచుకుంటేనే బాధేస్తుంది. అప్పుడప్పుడూ సమీక్షా సమావేశాలు పెట్టడం రోడ్లు బాగుచేయాలని ఆదేశిలిచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం తప్ప ఒక్క చోట కూడా కొత్తగా రోడ్డు వెయ్యడం లేదు అని ఆరోపించారు.
ఆత్మకూరులోని చేనేత డైయింగ్ కార్మికులను కలిసినప్పుడు ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదని, తమ కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువ అని వారు చెప్తుంటే బాధేసింది. డైయింగ్ ప్రక్రియలో వాడే రసాయనాల వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నారు.
అయినప్పటికీ తమకు తెలిసిన పని డైయింగ్ ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని పనిచేస్తున్నామని చేనేత కార్మికులు చెప్పారు. వర్షాకాలం పని ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుందని, అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందడంలేదని డైయింగ్ కార్మికులు చెప్పారు.
చేనేత డైయింగ్ కార్మికులకు గ్లవుజులు, సేఫ్టీ షూస్ అందజేసాను. మంగళగిరి నియోజకవర్గంలో చాలా సార్లు పర్యటించి చేనేత కార్మికులతో మాట్లాడటం వల్ల నేతన్నలు పడుతున్న కష్టాల పై నాకు చాలా అవగాహన కలిగింది. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాలి.
నూలుకి రంగులు అద్దే ప్రక్రియ మొదలుకొని అన్ని ప్రక్రియల్లో ఉన్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి పరిష్కరించాలి. ముఖ్యంగా
చేనేత డైయింగ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa