ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందల కోట్లు కోవిడ్ నిధులు మింగేసారా? లేదా మరణాలు తక్కువ చేసి చూపించారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 12:24 PM

ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య ముందు నుండీ మిస్టరీగా మార్చింది. ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత, బ్లాక్ లో అమ్మిన ఆక్సిజన్, రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్న ఆసుపత్రులు, అరకొర వసతులు, చెత్త భోజనం, తగ్గించి చూపబడిన కేసులు-మరణాలపై  పౌరులు ఎవరు ప్రశ్నించినా డిజాస్టర్ యాక్ట్ పేరుతో కేసులు పెట్టి వేధించారు. ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కేసారు అని టీడీపీ రాష్ట్ర నాయకులూ అచ్చేమ్ నాయుడు ఆరోపించారు. 


అయన మాట్లాడుతూ..... ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన సమాధానంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాలు ఇన్నాళ్ళుగా ఈ అమానవీయ ప్రభుత్వం చెబుతున్నట్లు కేవలం 14,733 కావనీ, రాష్ట్రంలో మొత్తం 47,228 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారని అర్థమవుతుంది. 


ఈ ప్రభుత్వం, తన అనుకూల పెయిడ్ మీడియా ఇన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తూ వచ్చాయి. నిజంగానే కేవలం 14,733 మంది మాత్రమే కోవిడ్ వల్ల మృతి చెందినట్లయిటే మరి 47,228 మంది మృతి చెందారు అని కేంద్రానికి అబద్ధం చెప్పి కేంద్రం పంపిన నిధులన్నీ మీ బులుగు పార్టీ వాళ్ళు స్వాహా చేశారా? ఈ పేరుతో ఎన్ని వందల కోట్లు నొక్కేశారు? లేదు, నిజంగానే 47,228మంది మృతి చెందితే కేవలం 14,733 మంది మాత్రమే మృతి చెందారు అని చెప్పి ఇన్నాళ్ళూ రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేశారు? అనేది ఇప్పుడు ఈ దుష్ట పాలకులు ప్రజలకు చెప్పాలి అని ప్రశ్నించారు.  


 


ఆఖరుకి ప్రజల మరణాల్లో కూడా దొంగ లెక్కలు చెప్పారు అంటే మీరసలు నిజంగా మనుష్యులేనా? ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ.. అటువంటిది మీ నేతృత్వంలో ప్రజలనే ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు కనుకనే మిమ్మల్ని ప్రజలు జగన్ మోసపు రెడ్డి అని పిలుస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రకటించిన మరణాలకు, కేంద్రం ప్రకటించిన మరణాలు దాదాపూ మూడు రెట్లు ఎందుకు అధికంగా ఉన్నాయో ప్రజలకు వివరణ ఇవ్వండి. 


 


పోలవరం పూర్తి చేసే తేదీపై తొడలు కొట్టి, మీసాలు తిప్పిన జలవనరుల శాఖ మాజీ మంత్రి పోయి కొత్తగా వచ్చిన మంత్రి "నాకు ఏమీ తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలీదు." అని పూటకో కహానీ చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నట్లు, కొవిడ్ మరణాల గురించి కూడా మాకేమీ తెలియదు అని సమాధానం దాటవేస్తారా? మౌనంగా ఉండి వందల కోట్ల నిధులు మీరే తినేసారని ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa