ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారిపై చర్యలు తీసుకొండి: పోలీసులకు చికోటి ప్రవీణ్ ఫిర్యాదు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 04:53 PM

తనపై దుష్ర్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు  కేసినో కేసులో చికోటి ప్రవీణ్  ఫిర్యాదు  చేశారు. ఇదిలావుంటే అతడిపై ఈడీ దర్యాప్తు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల్లోని కొందరు రాజకీయ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. తన పేరుపై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, తనకు ఇబ్బంది కలిగేలా, తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో తనకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పారు. చిన్నజీయర్ స్వామితో కూడా తనకు పరిచయం లేదని అన్నారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa