ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమతా బెనర్జీని ప్రజలు క్షమించరు: అధీర్ రంజన్

national |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 04:54 PM

ముర్షిదాబాద్ జిల్లా పేరును చరిత్ర నుంచి చెరిపివేస్తున్నారని, ప్రజలు మమతాను క్షమించరని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం బెంగాల్‌లోని మరో ఏడు జిల్లాల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ మేరకు ముర్షిదాబాద్ జిల్లాను మూడు భాగాలుగా విభజించారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముర్షీదాబాద్ జిల్లాను మూడు ముక్కలు చేయాలని నిర్ణయించిన సీఎం మంత్రి మమత బెనర్జీని బెంగాలీలు క్షమించరని ఆయన అన్నారు. ముర్షిదాబాద్ జిల్లా పేరును చరిత్ర నుంచి చెరిపివేస్తున్నారని, ప్రజలు మమతాను క్షమించరని అధీర్ రంజన్ అన్నారు.


సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించిన ప్రకారం ముర్షిదాబాద్, బహరంపూర్, కందిగా విభిజించడం జరిగింది. అదేవిధంగా ఉత్తర 24 పరగణాలు మూడు, దక్షిణ 24 పరగణాలు, నదియా, బంకురాలను రెండుగా విభజించారు. మొత్తం ఐదు జిల్లాలను 12 జిల్లాలుగా విభజించారు. ఈ మేరకు బెంగాల్ మ్యాప్‌లో ఏడు జిల్లాలు అదనంగా చేర్చారు.


ఈ సందర్భంగా "చరిత్రతో ముడిపడి ఉన్న జిల్లా పేరు మార్పును కాంగ్రెస్ అంగీకరిచదు. ఈ పేరు మార్పును బెంగాల్ ప్రజలు అంగీకరించరని నేను నమ్ముతున్నాను. జిల్లాను విచ్ఛిన్నం చేసే వారిని ప్రజలు క్షమించరు. ముర్షీదాబాద్ జిల్లాను విడగొట్టి బెంగాల్ చరిత్రను చెరిపేయాలని దీదీ ప్రయత్నిస్తున్నారు.. ముర్షిదాబాద్, బెంగాల్ ప్రజలు దీనిని ఏ మాత్రం అంగీకరించరు. జిల్లా సంప్రదాయం, చరిత్ర ఇలా చెరిపేసారు. జిల్లా విభజన జరిగినా జిల్లా పేరుతో ఉన్న గుర్తింపును మార్చలేం." అని అధీర్ రంజ్ అన్నారు. అంతేకాదు జిల్లా సంప్రదాయాన్ని నిలబెట్టడంలో కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంటుందని అధీర్ అన్నారు. జిల్లా పేరు చెక్కుచెదరకుండా ఉండేందుకు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పారు. ముర్షిదాబాద్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa