కడప విజిలెన్స్ ఏఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 11, 29, 062 విలువ చేసే రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ పురుషోత్తంరాజు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు కడప శివారు పాలెంపల్లె వద్ద చంద్రశేఖర్ రెడ్డి కి చెందిన రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. 159 బస్తాల చౌక బియ్యం, 520 బస్తాల నూక బియ్యం కలిపి మొత్తం 679 బస్తాలు జప్తు చేశామన్నారు. చంద్రశేఖర్ రెడ్డి నీ అరెస్టు చేసి చెన్నూరు పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa