తన దృష్టిలో ఇకపై సాయినాథుని దర్శనం కోసం భక్తులు షిరిడీ ఆలయానికి వెళ్లక్కర్లేదని, రంగం పేటలో నిర్మిస్తున్న సాయిబాబా గుడికి వస్తే సరిపోతుందని ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్బాబు వ్యాఖ్యానించారు. వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మరో వివాదంలో చిక్కుకున్నారు. సాయిబాబా దర్శనం కోసం ఇకపై షిరిడీ వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ బాలాజీ జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తమ విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ సమీపంలో మోహన్ బాబు కుటుంబం నూతనంగా సాయిబాబా ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన సందర్భంగానే మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
రంగంపేటలో నిర్మిస్తున్న సాయిబాబా గుడి దక్షిణాదిలోనే అతి పెద్దదని ఈ సందర్భంగా మోహన్ బాబు అన్నారు. ఇదొక అద్భుతమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన దృష్టిలో ఇకపై సాయినాథుని దర్శనం కోసం భక్తులు షిరిడీ ఆలయానికి వెళ్లక్కర్లేదని ఆయన అన్నారు. తమ కుటుంబం నిర్మించిన ఆలయం విశిష్టతను చెప్పే క్రమంలోనే మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేసినా సాయిబాబా భక్తులు ఇకపై షిరిడీ వెళ్లాల్సిన అవసరం లేదన్న ఆయన వ్యాఖ్యలు భక్తులను అసంతృప్తికి గురి చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa