తన భర్త హత్యకు కారణమైన నింధితులను గ్రామంలోకి రానివ్వద్దని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు హతుడు వైసీపీ నేత గంజి ప్రసాద్ భార్య సత్యవతి విన్నవించారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో సంచలనం రేపిన వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. ఏప్రిల్ 30న వర్గపోరులో నడిరోడ్డుపై గంజి ప్రసాద్ను అతి కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పది మంది నిందితులను అరెస్ట్ చేయగా వీరిలో ఎనిమిది మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, విడుదలైన వారు గ్రామంలోకి రాకుండా చూడాలని కలెక్టర్, ఎస్పీలకు హతుడు ప్రసాద్ భార్య సత్యవతి విన్నవించారు.
ఈ హత్యలో ప్రధాన నిందితులుగా బజారయ్య, సురేష్, మోహన్కుమార్, హేమంత్, గంజి నాగార్జున, రెడ్డి సత్యనారాయణలు ఉన్నారు. స్థానిక ఎంపీటీసీ బజారయ్య ప్రోద్బలంతోనే ముగ్గురు ఈ హత్య చేసినట్లు గతంలో ఎస్పీ తెలిపారు. ఏప్రిల్ 26న నిందితుడు సురేష్ కత్తులను తీసుకొచ్చాడని.. ప్రసాద్ అనే వ్యక్తి హత్యకు ముందు మూడు రోజులు రెక్కీ నిర్వహించారని.. ప్రసాద్ రాకపోకలను గంజి నాగార్జున పరిశీలించారన్నారు. హత్య జరిగిన రోజు గంజి ప్రసాద్ ఉదయం ఏడున్నరకు పాల కోసం ఇంటి నుంచి బైక్పై బయల్దేరగా.. సురేష్, హేమంత్ బైకుపై గంజి ప్రసాద్ను వెంబడించి హత్య చేశారన్నారు.
ప్రాణాలు కోల్పోయిన గంజి ప్రసాద్, హత్య కేసులో కీలక సూత్రదారి బిరుదుగడ్డ బజారయ్యలు వైఎస్సార్సీపీ నేతలు. ఈ ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా రాజకీయంగా చిన్నపాటి వైరం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య గొడవలపై ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఆయన వర్గం చెబుతోంది. అంతేకాదు మృతుడు గంజి ప్రసాద్ భార్య కూడా బజారయ్యతో పాటూ మరికొందరిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు బెయిల్పై విడుదలయిన వారిని తమ గ్రామంలోకి రానివ్వొద్దంటూ అధికారులను వేడుకొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa