ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు..రోడ్డు ప్రమాదంలో మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 09:41 PM

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన రోడ్డు ప్రమాదం రూపంలో వధువును మృత్యువు వెంటాడింది. చిలకలూరిపేటకు చెందిన రాచుమల్లు సాయిలక్ష్మీ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధార్‌ సెంటర్‌లో చిన్న ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యింది. బుధవారం రాత్రి వివాహానికి పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు.

సాయిలక్ష్మీ తల్లితో కలిసి మంగళవారం మొక్కు తీర్చుకునేందుకు బోయపాలెం పార్వతీదేవి ఆలయానికి స్కూటీపై బయలుదేరింది. యడ్లపాడు సమీపంలోని సుబాబుల్‌ తోట దగ్గరకు వెళ్లేసరికి స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలక్ష్మి బస్సు కింద, స్కూటీకి మధ్య ఇరుక్కుపోయి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెనుక కూర్చున్న తల్లి నాగలక్ష్మికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లి కళ్ల ముందే కూతురు అలా చనిపోవడాన్ని చూసి నాగలక్ష్మి అపస్మారక స్థితికి వెళ్లారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని బస్సు కింద ఇరుక్కుపోయిన సాయిలక్ష్మీని క్రేన్‌ సాయంతో బయటకు తీయాల్సి వచ్చింది. తీవ్ర గాయాలైన నాగలక్ష్మిని 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైవేపే దిష్టి తీసిన కొబ్బరికాయను తప్పించే క్రమంలో స్కూటీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa