అస్సాం ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి పబన్ కుమార్ బోర్తకూర్ నియమితులయ్యారు.ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ జిష్ణు బారువా పదవీ విరమణ చేసిన తర్వాత ఆగస్టు 31 నుంచి బోర్తకూర్ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.అస్సాం ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా ఆగస్టు 31న పదవీ విరమణ పొందిన తర్వాత రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APDCL) చైర్మన్గా కొనసాగుతారని నోటిఫికేషన్లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa