ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్ వాడీకి ఇకపై ఇంటర్మిడియట్ తప్పని సరి: కేంద్రం స్పష్టీకరణ

national |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 04:14 PM

అంగన్ వాడీ పోస్టుల నియామక అర్హతలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ మార్చేసింది. ఇప్పటి వరకు పదో తరగతి విద్యార్హత ఆధారంగా అంగన్ వాడీ టీచర్, వర్కర్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఇకమీదట ఇంటర్ విద్యార్థత తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇక అంగన్ వాడీ ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత వయసును కూడా 18 ఏళ్లకు తగ్గించింది. ఇప్పటి వరకు కనీసం 21 ఏళ్లు ఉండాలన్న నిబంధన ఉంది. అలాగే, 35 ఏళ్ల వయసు వరకు గరిష్ట వయోపరిమితి అర్హతగా ఉంటుంది. 


ఇక అంగన్ వాడీ ఉద్యోగాల్లోని వారికి రిటైర్మెంట్ వయసును నిర్ణయించలేదు. దీనిపై రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 65 ఏళ్లకు మించకుండా చూడాలని కోరింది. పార్ట్ టైమ్ ఉద్యోగులుగా వీరిని పేర్కొంది. అంగన్ వాడీ టీచర్ల నియామకాల్లో సగం ఉద్యోగాలను ఐదేళ్లపాటు పనిచేసిన ఆయాలతో భర్తీ చేయాలి. అలాగే, అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టుల్లో 50 శాతాన్ని ఐదేళ్ల అనుభవం ఉన్న టీచర్ తో భర్తీ చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa