సల్మాన్ రష్దీకి మద్దతు పలికిన పాపానికి మరో రచయితకు బెదరింపులు మొదల్యాయి. నీవు బాధపడకు తరువాతి వంతు నీదేనన్న హెచ్చరికలు జేకే రౌలింగ్ అనే రచయితకు వస్తున్నట్లు తెలిసింది. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడితో కలకలం రేగింది. ఒక రచయితను హత్య చేయాలని ప్రయత్నించడాన్ని చాలామంది ఖండించారు. దీనిపై ఎంతో మంది రైటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రచయితలు స్పందించారు. అందులో భాగంగా హ్యారీ పోటర్ సిరీస్ రచయిత్రి జేకే రౌలింగ్ కూడా సల్మాన్ రష్దీపై దాడిని వ్యతిరేకించారు. సల్మాన్ రష్డీపై దాడి అత్యంత భయంకరమైనదని పేర్కొన్నారు. తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని, రష్దీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అయితే జేకే రౌలింగ్.. సల్మాన్ రష్దీకు మద్దతుగా ట్వీట్ పెట్టడంతో ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఆమెను బెదిరించాడు. "బాధపడకు తర్వాతి వంతు నీదే" అని హెచ్చరించాడు. ఇలా ట్వీట్ పెట్టిన వ్యక్తిని అసిఫ్ అజీజ్ అనే నెటిజన్గా గుర్తించారు. అయితే అతను ఇరాన్ తీవ్రవాద సంస్థకు చెందని సానుభూతి పరుడిగా తెలుస్తుంది. ఈ అసిఫ్ సల్మాన్ రష్దీపై దాడిని సమర్థిస్తూ కూడా ఓ ట్వీట్ చేశాడు. సల్మాన్ రష్దీపై దాడి చేసిన వ్యక్తి పేరు హదీ మటార్ అని, అతను ఇరాన్కు చెందిన అయతొల్లా జారీ చేసిన ఫత్వాన్ని అనుసరించిన యోధుడని ట్వీట్ చేశాడు.
తనను బెదిరించిన ట్వీట్ను స్క్రీన్ షాట్ తీసి జేకే రౌలింగ్ ట్విట్టర్ సపోర్ట్ సెంటర్కు ట్యాగ్ చేసి తనకు సాయం చేయాలని కోరారు. ఈ బెదిరింపులపై పోలీసులకు దర్యాప్తు చేస్తున్నానని చెప్పారు. అయితే చాలామంది జేకే రౌలింగ్కు మద్దతుగా నిలిచారు. వారందరికి జేకే రౌలింగ్ ధన్యవాదాలు తెలియజేశారు. తనను బెదిరించిన అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. సంబంధిత నిందితుడు కోసం గాలింపు మొదలుపెట్టారు.
భారత మూలాలున్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై హదీ మటన్ అనే వ్యక్తి దాడి చేశాడు. న్యూయార్క్లోని ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా రష్దీని కత్తితో పొడిచాడు. 20 సెకన్లలో 15 సార్లు పొడిచాడు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందనే వార్తలు వస్తున్నాయి. వెంటిలేటర్ను తొలగించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పట్టనున్నట్టు సమాచారం. మరోవైపు సల్మాన్ రష్దీపై దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అత్యంత హేయమైన చర్యగా బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. ప్రముఖ రచయితలందరూ దీనిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను ఏ మాత్రం సహించకూడదంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa