గత రెండు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. గతంలో వరుసగా రెండు రోజులు కలిపి రూ. బంగారం ధరలు పెరిగిన తర్వాత 440 స్థిరంగా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు డిమాండ్ ఏర్పడిన తరుణంలో బంగారం ధర తగ్గడం వినియోగదారులను ఆకట్టుకునే అంశమని చెప్పవచ్చు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 48,150 కాగా, 24 క్యారెట్లు రూ. 52,530 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,360 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా తగ్గింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57,800. చెన్నైలో కిలో వెండి ధర రూ. 1400 తగ్గి రూ. 63,400 కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 63,400. విజయవాడ, విశాఖపట్నంలలో రూ. 63,400 కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa