పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట్లో రష్మిక మందన్న పేరు వినిపించినా, ఆమె బిజీగా ఉండటంతో మృణాల్ పేరు తెరపైకి వచ్చింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ దాదాపు రూ.3 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ 'డెకాయిట్' చిత్రంలో నటిస్తోంది.దీంతో వీరిద్దరి కాంబోను తెరపై చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలల ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa