ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్‌తో మలయాళ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 18, 2026, 12:05 PM

మలయాళ టీవీ నటుడు, 'వినీష్'గా సుపరిచితుడైన సిద్ధార్థ్ వేణుగోపాల్ (41) శనివారం క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రెండేళ్లుగా చికిత్స పొందుతూ.. శనివారం నాడు మరణించారు. నటి సీమ జి నాయర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. సిద్ధార్థ్ మృతి పట్ల మలయాళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన అనేక టెలివిజన్ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa