ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దయానంద సరస్వతి ఆశీస్సులు అందుకొన్న త‌లైవా

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2019, 08:51 PM

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న  ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న దర్బార్ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్నది. కొద్ది నెలలుగా ఉత్తర ప్రదేశ్, ముంబై, పూణెలో జరిగిన ఈ మూవీ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్ నేరుగా హిమాలయాలకు వెళ్లిపోయారని చిత్ర యూనిట్ వెల్లడించింది. హిమాలయాల పర్యటన కోసం రజనీకాంత్‌తో ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ జత కలిశారు. ఇద్దరు కలిసి ప్రత్యేక విమానంలో మూడు రోజుల క్రితం బయలుదేరి వెళ్లారు. ఆ ప్రాంతంలో ఓ ఆశ్రమంలో వారిద్దరూ ధ్యానం, యోగా చేస్తున్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పర్యటనకు ముందు రుషికేష్‌లోని దయానంద సరస్వతి ఆశ్రమాన్ని దర్శించుకొని ఆశీస్సులు అందుకొన్నారు. హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రజనీకాంత్ తలైవర్ 168వ చిత్ర షూటింగ్‌లో భాగమవుతారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa