1966 లో ఎన్ టి రామారావు, కె ఆర్ విజయ నాయికా నాయకులుగా సి పుల్లయ్య దర్శకత్వంలో పరమనందయ్య శిష్యుల కథ అప్పట్లో జనాలను అలరించింది, అంతకు ముందు నటుడు కస్తూరి శివరావు ఇదే కథతో 1950లో నాగేశ్వరరావు లక్ష్మి రాజ్యంలతో తెరకెక్కించారు. తదుపరి టీవీలోచ్చిన కొత్తలో దూరదర్శనలో పరమానందయ్య శిష్యులు ప్రేక్షకులను తెగ నవ్వించారు. తాజాగా ఇదే కథను తెలుగుతెరపై ప్రదర్శించే సాహసం చేస్తున్నాడు దర్శకుడు వెంకట్ రాజేష్ పులి.
పింక్ రోజ్ సినిమాస్ పతాకంపై కటమా రెడ్డి సంతన్ రెడ్డి ,సిహెచ్ కిరణ్ శర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పూర్తిగా బాలలతో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్ర నిర్మాణ 3 డి ఫార్మాట్లో సాగటంతో ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అయ్యే ఆస్కారం ఉంది.
ఈ సినిమా టీజర్ను ప్రొడక్షన్ యూనిట్ దర్శకుడు మారుతీతో విడుదల చేయించింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ, తెలుగువారికి అత్యంత ప్రియమైన కథలలో పరమానందయ్య శిష్యుల కథ ఒకటి. దానిని మరోమారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం జోడించుకుని 3డిలో నిర్మిస్తున్న చిత్ర బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. చిన్నారులు సైతం బాగా చేసినట్టు టీజర్ చెపుతోందని ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు"
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa