ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళకు వెళ్లనున్న‌మహేశ్‌బాబు!

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 07:16 PM

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర చేస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటోంది. త్వరలో  ఓ షెడ్యూల్‌ను కేరళలో ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణ కేరళకు వెళ్లనున్నారు. అక్కడ ఓ సీక్రెట్‌ మిషన్‌ను ప్లాన్‌ చేశారట. ఆ మిషన్‌ టార్గెట్‌ సంక్రాంతికి తెలుస్తుంది. అక్కడ ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ‘దిల్‌’ రాజు, మహేశ్‌ బాబు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా జన వరి 12న విడుదల కానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa