ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సినిమా తర్వాత నన్ను అక్కా అని పిలుస్తారు: అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2019, 02:38 PM

జబర్దస్త్ అనసూయ... ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సోషల్ మీడియలో కూడా అనసూయను ఫాలో అవుతున్నవాళ్లు కూడా తక్కువేం కాదు. జబర్దస్త్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ అప్పుడప్పుడు వెండితెరపై కూడా ఆడియన్స్‌ను కనువిందు చేస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో అందర్నీ తన నటనతో అనసూయ మెప్పించింది. అయితే తాజాగా ‘మీతో మాత్రమే చెబుతా’ అంటూ మరో సినిమాలో నటించింది అనసూయ, ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొమోషన్స్‌లో అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనసూయ స్పీచ్ స్టార్ట్ చేస్తుండగా... ఒక్కసారిగా ఆమె అభిమానులంతా ఈలలు వేయడం ఆరంభించారు. మాట్లాడుతుంటే కేకలు, అరుపులతో సందడి చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులకు సినిమా విశేషాలు చెబుతూ అనసూయ..కోన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రంగస్థలం సినిమా తర్వాత నన్ను చాలామంది రంగమ్మత్త అని పిలిచారని... అయితే  మీకు మాత్రమే చెబుతా సినిమా తర్వాత .. నన్ను మీరంతా అక్కా అని పిలివాల్సి వస్తుందేమోనని అంటూ మాట్లాడారు. దీంతో అక్కడున్న అనసూయ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa