మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పటి వరకు స్టార్ గా గుర్తింపు తెచ్చుకోలేని హీరో అల్లు శిరీష్ మాత్రమే. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసాడు కానీ అల్లు వారబ్బాయికి ఎందుకో క్రేజీ హీరోగా గుర్తింపు రాలేదు. అలా అని శిరీష్ ను తీసి పారేయలేం. గతేడాది శ్రీరస్తు శుభమస్తుతో తొలి విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు ఒక్కక్షణం అంటూ డిఫెరెంట్ సినిమాతో వస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. విఐ ఆనంద్ దర్శకుడు కావడంతో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందనే అంచనాలున్నాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత విఐ ఆనంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఒక్కక్షణంకు కలిసిరానుంది. డిసెంబర్ 28న ఒక్క క్షణం విడుదల కానుంది. సురభి, సీరత్ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలో నటించాడు.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల మేర జరుగుతుంది. అసలు శిరీష్ సినిమాలకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. ఇక ఇప్పుడు శాటిలైట్ కూడా ఊహకందని రేంజ్ లో అమ్ముడైంది. ఒకటి రెండు కాదు ఏకంగా 3.20 కోట్లకు ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కొనేసింది జెమినీ ఛానెల్. శిరీష్ సినిమాలకు ఈ రేంజ్ రేట్ పలకడం ఇదే తొలిసారి. చాలా అంశాలు దీనికి హెల్ప్ అయ్యాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా టీవీల్లోనూ సూపర్ హిట్ కావడం.. శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట లాంటి సినిమాలు టీవీల్లో మంచి రేటింగ్స్ సాధించడంతో ఒక్కక్షణంకు ఈ రేట్ పలికింది. ఇది కానీ హిట్టైతే అల్లు శిరీష్ కూడా క్రేజీ హీరో అయిపోయినట్లే..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa