ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మత్తు వదలరా' అంటున్న రానా

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2019, 01:01 PM

ఈరోజు సాయంత్రం 4 :05 నిమిషులకు  'మత్తు వదలరా' చిత్ర ట్రైలర్ ను ప్రముఖ హీరో రానా దగ్గుపాటి రిలీజ్ చేయబోతున్నాడు. దీని తాలూకా పోస్టర్ ను రానా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎన్టీఆర్ విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో న్యూస్ పేపర్స్‌పై నిద్రపోతున్న హీరోను చూపించారు. అతని టీషర్ట్‌పై టెక్నీషియన్స్ పేర్లు రాసి ఉండటం దర్శకుడి లోని కొత్త థాట్ చెప్పకనే చెబుతోంది. నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహిస్తుండగా, చిరంజీవి (చెర్రీ) - సుమలత నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే అగ్ర బ్యానర్ గా గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన ఈ బ్యానర్..తాజాగా స్మాల్ బడ్జెట్ తో కొత్త నటి నటులతో మత్తు వదలరా అనే సినిమా చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా పరిచయం కాబోతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa