సినీరంగంలో ఎప్పటికప్పుడు నంబర్లు మారుతుంటాయి. ఎవరికీ నెంబర్ వన్ స్ధానం శాశ్వతం కాదు. మ్యూజిక్ విషయానికి వస్తే ఒకప్పుడు మణిశర్మ ను అగ్ర సంగీత దర్శకునిగా కొనియాడారు. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్బాబు వంటి స్టార్స్ చిత్రాలకు ఆయన బాణీలు అందించారు. చిత్ర విజయంలో భాగమయ్యారు. ఆ తర్వాత మణిశర్మ బదులుగా దేవిశ్రీప్రసాద్ పేరు వినిపించసాగింది. స్టార్స్ అంతా ఆయన మ్యూజిక్ను రికమండ్ చేశారు. అరుపులు, కేకలతో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ యువతని అలరించింది. ఈ మత్తులో దేవిశ్రీ గాయకుని అవతారం ఎత్తారు. ఆయన ఆలపించిన పాటలు వినడానికి ఇబ్బంది తప్పలేదు. కారణాలు ఏమైనా దేవిశ్రీప్రసాద్ క్రమక్రమంగా వెనుకపడ్డాడు. ఇప్పుడు తమన్ హవా నడుస్తోంది. తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న తమన్ చాలా వేగంగా బాణీలు ఇస్తారని పేరుంది. ఎక్కువ సినిమాలు కమిటైనప్పటికీ, ఇబ్బంది లేదు. గతవారం విడుదలైన వెంకీమామ ఆయనకు మంచి పేరు తెచ్చింది. సంక్రాంతికి వస్తున్న అలా వైకుంఠపురుములో చిత్రం పాటలు ఇప్పటికే ట్రెండింగ్లో ఉన్నాయి. ఇంకా అనేక చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. సంక్రాంతి పోటీలో దేవిశ్రీప్రసాద్ (సరిలేరు నీకెవ్వరు), తమన్ (అలా వైకుంఠపురములో) ఉన్నారు. వీరిలో విజేత ఎవరో తేలాల్సి ఉంది. ఎంతైనా దేవికి బ్యాడ్ టైమ్ మొదలైనట్టే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa